రాష్ట్రస్థాయి సీట్లు సాధించిన ఓం ఆదిత్య గాయత్రి విద్యార్థులు

Published: Wednesday June 29, 2022
ఏన్కూరు, జూన్ 28 (ప్రజాపాలన న్యూస్): తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట హైదరాబాద్ లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20 సీట్లలో 2 సీట్లను ఏన్కూరు మండలంలోని ఓం ఆదిత్య గాయత్రి స్కూల్ విద్యార్థులు కైవసం చేసుకున్నారు. స్కూల్లో చదువుతున్నఉగ్గం అశ్వంత్, వీరోజు దీక్షిత ఈ సీట్లు సాధించారు. ఇరువురు విద్యార్థులు సీట్లు సాధించడం పట్ల మండల విద్యాశాఖ అధికారి జయరాజు అభినందించారు. ఈ సందర్భంగా స్కూల్ నిర్వాహకులు దాసరి రమేష్ మాట్లాడుతూ
తమ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో  కూడా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల విద్య బోధన, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం నిర్వాహకులు దాసరి రమేష్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.