*కంటివెలుగును ప్రారంభించిన ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు..

Published: Wednesday February 22, 2023

 

తల్లాడ, ఫిబ్రవరి 21 (ప్రజా పాలన న్యూస్): 

 *తల్లాడ మండలంలోని నూతనకల్లులో గ్రామ సర్పంచ్ తూము శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కంటివెలుగును తల్లాడ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రతిఒక్కరికి కంటిచూపును అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి దిరిశాల ప్రమీల, ఎంపీడీవో రవీంద్రారెడ్డి, సర్పంచ్ తూము శ్రీనివాసరావు, తల్లాడ ప్రాథమిక ఆసుపత్రి వైద్యులు, ఎంపీటీసీ బానొతు మోహన్, వైరా మార్కెట్ డైరెక్టర్ నాయుడు శ్రీనివాసరావు, ఆశా కార్యకర్తలు, అంగన్ వాడీ  టీచర్లు తదితరులు పాల్గొన్నారు.*తల్లాడ, ఫిబ్రవరి 21 (ప్రజా పాలన న్యూస్):