కామినేని ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

Published: Friday September 24, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 23, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఏడవ వార్డు సీతారాంపేట గ్రామంలో  గురువారం రోజు కామినేని హాస్పిటల్ నుండి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  కౌన్సిలర్ శ్రీ లత రాంబాబు  మాట్లాడుతూ గ్రామ ప్రజలు డాక్టర్లకు సహకరించాలని  దీనికి గాను గ్రామ ప్రజలందరూకి బిపి, షుగర్, కాళ్ల నొప్పులు, కంటి చూపు సంబంధించిన సమస్యలను టెస్టులు  చేయించుకున్న వారికి మందులు ఇవ్వడం జరగింది. ప్రజలందరూ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. పిలవగానే కామినేని సిబ్బంది రావడం జరిగింది వారికి కామినేని ఆస్పటల్ మేనేజ్ మెంట్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ సుదర్శన్ రెడ్డి మరియు ఏడవ వార్డ్ కౌన్సిలర్ శ్రీ లత రాంబాబు డాక్టర్ల బృందం  మరియు సీతరామ్ పేట గ్రామం టిఆర్ఎస్ పార్టీఅధ్యక్షుడు వంశి చందర్ రెడ్డి ఉపాధ్యక్షుడు నరసింహ ప్రధాన కార్యదర్శి  రవి కార్యదర్శి కృష్ణ ప్రచార కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి గ్రామ పెద్దలు అందరూ ఆధ్వర్యంలో జరిగింది.