మోడీ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాలు నిండిన సందర్భంగా ఇంటింటా ప్రచారం..
Published: Wednesday June 08, 2022
పాలేరు జూన్ 7 ప్రజాపాలన ప్రతినిధి
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దిగ్విజయంగా ఎనిమిది సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా, సేవ సుపరిపాలన గరీబ్ కళ్యాణ్ యోజన కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మండల అధ్యక్షులు మన్నే కృష్ణారావు మండలం లో పలు గ్రామాలు తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు అవగహన కల్పిస్తూ, కేంద్ర ప్రభుత్వ పథకాల కరపత్రాలు, మరియు స్టికర్ లను ప్రతి ఇంటికి వెళ్ళి అందజేశారు... ఈ కార్యక్రమంలో మీగడ గోపి, నున్న వెంకటేశ్వరరావు, గొలుసు ఆంజనేయులు, బోయినపల్లి ఉపేందర్ పాల్గొన్నారు.
Share this on your social network: