మద్యం మత్తులో పురుగుల మందు సేవించి వ్యక్తి మృతి
Published: Saturday October 08, 2022
జన్నారం, అక్టోబర్ 07, ప్రజాపాలన: మద్యం మత్తులో పురుగుల మందు సేవించి మృతి చెందిన సంఘటన మండలంలోని చింతగూడ గ్రామంలో చోటు చేసుకుంది. సెకండ్ ఎస్ఐ రాథోడ్ థానాజీ, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన నాసాని శంకరయ్య (53) కొంత కాలంగా మద్యానికి బానిసై మద్యం సేవించేవాడు. దసరా పండుగ సందర్భంగా ఎక్కువగా మద్యం తాగవద్దని కుటుంబ సభ్యులు చెప్పిన వినకుండ మత్తులో పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబీకులు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తరలించి చికిత్స జరుగుతూ ఉండగా గురువారం అర్థరాత్రి మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారని ఎస్ఐ తానాజీ అన్నారు. మృతుని భార్య నాసాని కమల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తానాజీ తెలిపారు.
Share this on your social network: