ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి

Published: Monday October 18, 2021
తెలుగుదేశం పార్టీ పెద్ద పెళ్లి పార్లమెంట్ ఇన్చార్జ్ సంజయ్
బెల్లంపల్లి అక్టోబర్ 17, ప్రజాపాలన ప్రతినిధి : ముఖ్యమంత్రి ప్రజలకిచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేనిచో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి సంజయ్ అన్నారు. బెల్లంపల్లిలో ఆదివారం నాడు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన 34 వార్డులలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి వార్డు కమిటీలు వేయటం, మరియు పార్టీ సభ్యత్వం గురించి, ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని దళిత బందు, నిరుద్యోగ భృతి, రైతుల రుణమాఫీ, సింగరేణిలో కొత్త భూగర్భ గనులు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకులకు ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్న హామీలను వెంటనే నెరవేర్చాలని, లేనియెడల ఆందోళన కార్యక్రమాలు చేస్తామని పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రిని హెచ్చరించారు. ఈ సమావేశంలో బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు టి, మనీ రామ్ సింగ్, ఉపాధ్యక్షులు అమానుల్లాఖాన్, రాష్ట్ర నాయకులు రాజ్ కుమార్ పాండే, సిరికొండ కనకయ్య, సాదిక్ భాషా, బొల్లం మల్లయ్య, సిహెచ్ రమేష్, అచ్చయ్య, బుకూర్, ఎండి హాసన్, మహబూబ్, సదానందం, రాయమల్లు, టి వెంకటేష్, రాజయ్య, బి.రాములు, తదితరులు పాల్గొన్నారు.