తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాంవైఎస్సార్ టిపి దళిత విభాగం జిల్లా అధ్యక్షుడు మద

Published: Friday June 17, 2022

మధిర రూరల్ జూన్16 ప్రజాపాలన ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో వైయస్ షర్మిల నాయకత్వంలో రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చేందుకు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేయాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు రిటైర్డ్ సీఐ మద్దెల ప్రసాదరావు ఖమ్మం అసెంబ్లీ కోఆర్డినేటర్ టికే మోహన్ వైరా అసెంబ్లీ కోఆర్డినేటర్ రామ్ నాయక్ చింతకాని మండల అధ్యక్షులు వాకా వీరా రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఖమ్మం పట్టణంలో ప్రారంభమైన వైఎస్ షర్మిల పాదయాత్రకు వారు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఖమ్మం పట్టణంలో వైఎస్ షర్మిలతో కలిసి వారు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ టిఆర్ఎస్ ఎనిమిదేళ్ళ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా వైయస్సార్ తెలంగాణ పార్టీని ప్రజల గుర్తించి జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరవుతున్నారని వారు తెలిపారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రశ్నించే ప్రతిపక్షాలు లేకపోవడంతో వైయస్ షర్మిల ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం కావాలంటే షర్మిలమ్మ రావాలి అనే నినాదంతో ఇంటింటికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అనే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నట్లు వారు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రైతులకు ఒకే సారి రుణమాఫీ చేశారని, పత్తి విత్తనాల ధరలను తగ్గించారని, ఫీజు రియంబర్స్మెంట్, 108, 104, ఉచిత విద్యుత్, ప్రాజెక్టుల నిర్మాణం అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వటం లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని, మైనార్టీలకు రిజర్వేషన్లు అందించారని వారు గుర్తు చేశారు. ప్రస్తుత టిఆర్ఎస్ పాలనలో నిరుద్యోగ భృతి లేదని, ఎనిమిదేళ్లుగా కొత్త పెన్షన్లు ఇవ్వటం లేదని, రుణమాఫీ లేదని, ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడంలేదని వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం కావాలంటే షర్మిలమ్మ రావాలని నినాదాన్ని గ్రామ గ్రామాన మారుమ్రోగే విధంగా నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఇంటింటికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. వైయస్ షర్మిల పాదయాత్ర రాష్ట్ర కోఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రామిరెడ్డి సూచనలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గడిపల్లి కవిత జిల్లా అధ్యక్షులు లక్కినేని సుధీర్ నాయకత్వంలో సమిష్టిగా పనిచేసి  జిల్లాలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలిపారు.