అంటువ్యాధులు ప్రబలకుండా అప్రమతం కావాలి. ఎంపీడీవో కె జమలారెడ్డి.

Published: Thursday July 28, 2022
పాలేరు జూలై 27 ప్రజా పాలన ప్రతినిధి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి
హరితహారం పంచాయతీల లక్ష్యం ను పూర్తి చేయాలి.
సీజనల్ లో అంటు వ్యాధులు ప్రబలకుండా అప్రమతం కావాలని
నేలకొండపల్లి ఎంపీడీఓ కె. జమలారెడ్డి సూచించారు. మండల పరిషత్ కార్యాలయం లో బుధవారం పంచాయతీ కార్యదర్శుల సమీక్ష సమావేశం ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున్న తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
 
గ్రామాల్లో పారిశుద్ధ్యం పట్ల చిత్తశుద్ధి తో పని చేయాలని ఆదేశించారు. డెంగీ జ్వరాలు రాకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మురుగు కాల్వలో ఆయిల్ బాల్స్ వేయాలని. సూచించారు. ఫీవర్ సర్వే ను వెంటనే ప్రారంభించాలని సూచించారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలు శర వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. హరితహారం లో పంచాయతీలకు ఇచ్చిన లక్ష్యం ను శరవేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మండల పంచాయతీ అధికారి శిష