గంజాయి పట్టివేత

Published: Thursday October 07, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 06 (ప్రజాపాలన ప్రతినిధి) : మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ బాలురు తమ వ్యవసాయ భూమిలో గంజాయి మొక్కలను పెంచుతూ వాటిని అధిక ధరలకు అమ్మడం జరుగుతున్నది గత మూడు నెలల క్రితం మైనర్ బాలురు తమ వ్యవసాయ భూమిలో గంజాయి విత్తనాలను వేసి మొక్కలు పెంచి ఈరోజు వాటిని అమ్మటానికి వెళ్తుండగా పోలీసులకు నమ్మదగిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి మైనర్ బాలులను పట్టుకొని మెట్పల్లి ఇంచార్జ్ తాసిల్దార్. వినయ్ కుమార్ సమక్షంలో మైనర్ బాలురు పెంచిన టువంటి గంజాయి మొక్కలను స్వాధీనపరచుకొని అట్టి మైనర్ల పై కేసు నమోదు చేయడం జరిగినది అని మెట్పల్లి సీఐ, ఎల్ శ్రీను తెలిపినారు ఈ గంజాయి పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన టువంటి ఎస్సై ఏం రాజ ప్రమీలను అభినందించారు