మైత్రీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

Published: Friday May 07, 2021
గుమ్మడిదల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మైత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం శిబిరాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్.ఐ. విజయకృష్ణ, జడ్పీటీసీ కుమార్ గౌడ్, గుమ్మడిదల సర్పంచ్ నర్సింహారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు, కరోనా విపత్కర పరిస్థితుల్లో నిలోఫర్ హాస్పిటల్ వారు గర్భిణీ స్త్రీలకు మరియు తలసేమియా వ్యాధి బాధితులకు రక్తం అత్యవసరం ఉందనే విషయాన్ని మైత్రీ ఫౌండేషన్ కు తెలుపగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక  యువకులు 25 మంది స్వచ్చందంగా రక్తదానం శిబిరంలో పాల్గొని, రక్తదానం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మైత్రీ ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయకుమార్ సభ్యులు మ్యాకల మహేష్ కుమార్, నవీనసాగర్, ఐనవోలు వేంకటరెడ్డి, నల్ల శ్రీనివాసగౌడ్, కంది రాము, పడమటి నిఖిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు