ఎస్పీ ఆఫీసులో గాంధీ జయంతి వేడుకలు...

Published: Monday October 04, 2021
జగిత్యాల, అక్టోబర్ 02 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో మహాత్మాగాంధీ 152వ  జయంతి సందర్భంగా ఎస్పీ సిందూశర్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గాంధీజీ సూచించిన శాంతి అహింస సత్యం మార్గంలో ముందుకు సాగాలని గాంధీ సన్మార్గంలో ప్రయాణిస్తూ నమ్మిన సిద్ధాంతాలను విలువలను నిబద్ధతతో ఆచరించడం వల్ల ఆయన కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం అయ్యాయని అన్నారు. స్వాతంత్రం కోసం గాంధీజి చేసిన సేవలు మరువలేనివి అన్నారు. దేశ అభివృద్ధి కోసం నిస్వార్థంగా మనమందరం సేవలు అందించాలని ఆయన ఆశయాల సాధనకు మనందరం కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఎస్పీ కె. సురేష్ కుమార్ డి.ఎస్పీ ఆర్ ప్రకాష్ కుమార్ సీఐ కృష్ణ కుమార్ కిషోర్ ఆర్ఐ వామనమూర్తి జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.