బహుజన జైత్రయాత్ర యొక్క గోడ పత్రిక ఆవిష్కరణ
Published: Thursday September 23, 2021
మల్లాపూర్, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : మల్లాపూర్ మండల కేంద్రంలోని భరతమాత విగ్రహం వద్ద బుధవారం బహుజన సమాజ్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26న జగిత్యాలలో జరగబోయే రాజ్యాధికారా సాధనకై బహుజన జైత్రయాత్ర యొక్క గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లాపూర్ మండల అధ్యక్షులు బోడ ప్రశాంత్ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లోని యువత, బహుజన వాదులందరూ పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మచ్చ శైలేందర్, కన్వీనర్ తలారి ప్రేమ్, సాగర్, సుంచు శ్రీకాంత్, సెక్టార్ కమిటీ సభ్యులు సుద్ధపల్లి రంజిత్, తలారి నవీన్, గడుచంద మహేష్, దాసరి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: