రైతులు పంట వివరాలను నమోదు చేసుకోవాలి

Published: Tuesday July 20, 2021
బీరుపూర్, జులై 19 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ మంగేల బీరుపూర్ గ్రామాల్లో వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. 2021 ఖరీఫ్ సాగు పంటకు సంబంధించిన పంటల వివరాలను రైతులు నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారిణి అనూష తెలియజేశారు. ఖరీఫ్ సాగులో వేసిన పంటలకు చీడపీడల నుండి నివారణ చర్యల గురించి అవగాహన కల్పించి ఖరీఫ్ లో వేసిన పంటలను విస్తరణ అధికారులు శిరీష సందీప్ నమోదు చేసుకున్నారు.