బివిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక

Published: Thursday December 09, 2021
బివిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిములు
వికారాబాద్ బ్యూరో 08 డిసెంబర్ ప్రజాపాలన : భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి (బివిహెచ్పిఎస్) వికారాబాద్ జిల్లా కమిటీని ఎన్నుకున్నామని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యాదర్శి కావలి నర్సిములు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బివిహెచ్పిఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా కోటపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొత్త జెర్ణయ్యను, జిల్లా ఉపాధ్యక్షులుగా బషీరాబాద్ మండలం నవల్గా గ్రామానికి చెందిన చిట్కా నగేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు జెర్నయ్య, నాగేష్ లు మాట్లాడుతూ మా పైన నమ్మకం ఉంచి జిల్లా స్థానం కల్పించినందుకు నర్సిములు కు కృతజ్ఞతలు తెలిపారు. వికలాంగుల సమస్యలపైన నిరంతరం పోరాడుతామని తెలిపారు.