రూ 10 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కార్పొరేటర్

Published: Friday August 26, 2022
మేడిపల్లి, ఆగస్టు25 (ప్రజాపాలన ప్రతినిధి)
 రామంతాపూర్ డివిజన్లోని ప్రగతి నగర్ కాలనీలో రూ 10 లక్షల వ్యయంతో  సీసీ రోడ్ పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరై స్థానిక కార్పొరేటర్  బండారు శ్రీవాణి వెంకట్రావుతో కలిసి పనులను ప్రారంభించారు. అనంతరం ప్రగతి నగర్లో పర్యటించి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేందర్,  డీ.ఈ. నాగమణి ,అసిస్టెంట్ ఇంజనీర్ శ్వేతాశ్రీ, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు బండారు వెంకట్ రావు, కాలనీ అధ్యక్షులు బొబ్బల వెంకటేశ్వర్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర రెడ్డి, గడ్డం రవికుమార్ గరిక సుధాకర్, రామంతపూర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎండి ముస్తాక్, ప్రధాన కార్యదర్శి జెసిబి రాజు, నాయకులు లింగ నాయక్,  రవి నాయక్,స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.