మండల రిసోర్స్ సెంటర్ ను సందర్శించిన జాయింట్ రివ్యూ మిషన్ సభ్యులు

Published: Thursday November 24, 2022
చౌటుప్పల్ నవంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి):
యాదాద్రి భువనగిరి జిల్లాలో జాయింట్ రివ్యూ మిషన్ టీంలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన అమలు గురించి నవంబర్ 23 వ తేదీ నుండి 25 తేదీ వరకు మూడు రోజులపాటు పాఠశాలలను సందర్శించనున్నాయి. ఈ సందర్శనలో భాగంగా బుధవారం చౌటుప్పల్ మండల రిసోర్స్ సెంటర్లో మండల విద్యాధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం జిల్లాలో ఎలా అమలు అవుతుందో అన్న విషయాలను చర్చించారు.