మృతుడి కుటుంబానికి ఎస్కేఆర్ ట్రస్టు ఆర్థిక సాయం
Published: Tuesday March 07, 2023
* ఎస్కెఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సనగారి కొండల్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 06 మార్చి ప్రజాపాలన : మర్పల్లి మండల పరిధిలోని కల్ఖోడ గ్రామంలో చెవుల శ్రీనివాస్ ఆదివారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మృతి చెందడం జరిగింది. అట్టి విషయం స్థానిక ఎంపిటిసి పసుల శ్రీవిద్య వెంకటేష్ ముదిరాజ్ ద్వారా తెలుసుకున్న ఎస్కేఆర్ ట్రస్టు వ్యవస్థాపకులు జిల్లా కేంద్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి, చెవుల శ్రీనివాస్ అంత్యక్రియలకు 5000 రూపాయలు ఆర్థిక సహకారం అందజేశారు. గ్రామస్తులతో కలిసి మృతుడు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఎస్ కే ఆర్ పంపిన 5000 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ పి శ్రీనివాస్ సి,సుదర్శన్ , సి రత్నం ,వై యాదగిరి, ఎస్ వెంకటేష్ ,పి ఇబ్రహీం ,సిహెచ్ రాములు ,డి శ్రీనివాస్ ,సి బలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: