పీర్జాదిగూడ నగర తైబజార్ ను 30 లక్షల 50వేలకు దక్కించుకున్న నక్క మధు గౌడ్

Published: Wednesday March 31, 2021
మేడిపల్లి, మార్చి30 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ నగర త్తెబజార్ ను 30 లక్షల 50వేలకు బహిరంగ వేలం పాటలో నక్క మధు గౌడ్ దక్కించుకున్నారు. ఈ మేరకు పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ ఎం. శ్రీనివాస్ సమక్షంలో తైబజారు బహిరంగ వేలం పాటను నిర్వహించారు. త్తెబజార్ వేళము పాటలో కె.జలందర్ రెడ్డి రూ౹౹ 27,00,000-00లు నక్క మధు గౌడ్ రూ౹౹ 30,50,000-00లు బొడిగే రాజ్ కుమార్ రూ౹౹ 28,16,000-00లు పానుగంటి శ్రీకాంత్ రూ౹౹ 30,30,000-00 పాల్గొన్నారు. పైన చూపిన వారిలో అత్యధిక వేళము పాట పాడిన నక్క మధు గౌడ్ రూ౹౹ 30,50,000-00 అక్షరాల ముప్పై లక్షల యాభై వేల రూపాయలకు వేళము పాడుకొని తైబజారు ఫీజు వసూళ్లు హక్కును దక్కించుకొన్నారు.