ప్రతి ఒక్కరూ కరోనా టీకాను వేయించుకోవాలి : ఎంపీ రేవంత్ రెడ్డి

Published: Friday June 04, 2021
మేడిపల్లి, జూన్ 3, ప్రజాపాలన ప్రతినిధి : ప్రతి ఒక్కరూ కరోనా టీకాను వేయించుకొని సురక్షితంగా ఉండాలని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఉప్పల్  ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీ రేవంత్ రెడ్డి కోవాగ్జిన్ కరోనా టీకా రెండో డోస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వాక్సినేషన్ను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ప్రజలందరికీ వాక్సినేషన్ అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ కార్పొరేటర్ మందుముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి, డా.సౌందర్యలత, ప్రకాష్, కాంగ్రెస్ నాయకులు తవిడబోయిన గిరిబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.