పదిలక్షల చెక్కు అందించిన ఎమ్మెల్యే సండ్ర..
Published: Wednesday August 24, 2022
తల్లాడ, ఆగస్టు 23 (ప్రజా పాలన న్యూస్): తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన నష్మిన్, కుమారుడు సైదా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో ఇటీవల మృతి చెందారు. మంగళవారం ఆ కుటుంబ సభ్యులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పదిలక్షల చెక్కును అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ఒకే కుటుంబంలో తల్లి, కుమారుడు మరణించడం బాధాకరమైన విషయమని, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని వారికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో ఒక్కకరికి 2 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కులను మంజూరు చేయించి 4 లక్షల రూపాయల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు కొన్ని నెలలక్రితం వారి ఇంటికి వెళ్లి అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డేం వీర మోహన్ రెడ్డి, వైరా ఏఎంసి వైస్ చైర్మన్ ధూపాటి భద్రరాజు, ఇంజం కృష్ణార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: