పదిలక్షల చెక్కు అందించిన ఎమ్మెల్యే సండ్ర..

Published: Wednesday August 24, 2022
 తల్లాడ, ఆగస్టు 23 (ప్రజా పాలన న్యూస్): తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన నష్మిన్, కుమారుడు సైదా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో ఇటీవల మృతి చెందారు. మంగళవారం ఆ కుటుంబ సభ్యులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పదిలక్షల చెక్కును అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు ఒకే కుటుంబంలో తల్లి, కుమారుడు మరణించడం బాధాకరమైన విషయమని, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని వారికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో ఒక్కకరికి  2 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కులను మంజూరు చేయించి 4 లక్షల రూపాయల చెక్కులను వారి కుటుంబ సభ్యులకు కొన్ని నెలలక్రితం వారి ఇంటికి వెళ్లి అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డేం వీర మోహన్ రెడ్డి,  వైరా ఏఎంసి వైస్ చైర్మన్ ధూపాటి భద్రరాజు, ఇంజం కృష్ణార్జునరావు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area