పలు కార్యక్రమాలు హాజరైన బీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు

Published: Friday January 06, 2023
మధిర జనవరి ఐదు ప్రజాపాలన ప్రతినిధి నియోజకవర్గ పరిధిలో గురువారం నాడు పలు కార్యక్రమాల హాజరు పలు ఆశీర్వాదాలు, పలు పరామర్శలు.
ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల గ్రామంలో  చాట్ల కిషోర్, శ్రావ్య ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం తక్కెళ్లపాడు గ్రామంలో గ్రామ సర్పంచ్ కూరపాటి సుందరమ్మ  కాలు విరిగి ఆపరేషన్ అవ్వగా వారిని పరామర్శించి వారికి దైర్యం కల్పించారు. వారి రిపోర్ట్స్ పరిశీలించి వారు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు వివరించారు.మున్సిపాలిటీ పరిథిలో ఎంప్లాయీస్ కాలనీ నందు గణపవరపు వెంకటేశ్వరరావు ఇటీవలే మరణించగా వారి దశధిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు