మొబైల్ వాక్సినేషన్” సెంటర్ ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి

Published: Tuesday June 29, 2021
- గచ్చిబౌలి కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండాలో గల ప్రైమరీ పాఠశాల వద్ద జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “మొబైల్ వాక్సినేషన్ సెంటర్” ను సోమవారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పాల్గొని స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. అనంతరం వాక్సినేషన్ ప్రక్రియను కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాక్సిన్ తప్పని సరిగా వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాని వాళ్లకు ఈ మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఎక్కువ సేపు లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఉదయం 9 గంటల నుంచి ఒక్కో మొబైల్‌ సెంటర్‌ ద్వారా రోజుకి 150 నుంచి 200 మందికి వ్యాక్సిన్ వేస్తారని అన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ సెంటర్ లు ఉంటాయని, వ్యాక్సిన్ కోసం వచ్చిన వారు ఆధార్ వివరాలు తెలిపి వాక్సిన్ వేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇనస్పెక్టర్ జలెందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, జి.హెచ్.ఎం.సి శానిటేషన్ సూపర్వైజర్  రాందాస్, సీనియర్ నాయకులు వెంకటేష్, శ్రీశైలం, ప్రభాకర్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.