బిజెపి పార్టీ ఆధ్వర్యంలోఘనంగా,పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ 106వ జయంతి వేడుకలు,
Published: Monday September 26, 2022
మధిర సెప్టెంబర్ 25 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో,బీజేపీ సిద్ధాంతం కర్త,స్వతంత్రసమరయోధులు,మానవతావాది, అంతొదయం రూపకర్త, పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం ఘనంగా మధిర లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పలు వార్డులలో 9,15వార్డులలో మొక్కలు నాటినారు. అనంతరం కార్యకర్తలు నాయకులు కలిసి అసెంబ్లీ కన్వీనర్ గా నియమితులైన ఏలూరి నాగేశ్వరావు ని, జిల్లా అధికార ప్రతినిధి గా నియమితులైన రామిశెట్టి నాగేశ్వరావు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు గా నియమితులైన కోనా నరసింహారావు ఘనంగా సన్మానించటం జరిగినది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మహనీయులు పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ ఆశయాలు కు అనుగుణంగా ప్రతి బీజేపీ కార్యకర్త నడుచుకోవాలని,చెప్పటం జరిగింది,
ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి, పెరుమాళ్ళపల్లి విజయరాజు, అసెంబ్లీ కన్వీనర్, ఏలూరి నాగేశ్వరావు, బీజేపీ జిల్లా కార్యదర్శి, చిలువేరు సాంబశివరావు, జిల్లా అధికారం ప్రతినిధి రామిశెట్టి నాగేశ్వరావు,పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్,బిజెపి సీనియర్ నాయకులు కొప్పు రావూరి రామ యోగేశ్వరావు, బిజెపి జిల్లా కార్యవర్గసభ్యులుకోనానరసింహారావు,ఓబీసీ నాయకులు జివిఆర్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి బియ్యవరపు రామకృష్ణ మరియు పగడాల నాగేంద్రబాబు, బీజేవైఎం నాయకులుకుక్కలరామ్,మోహనరావు,బెజ్జం శ్యామ్,పెరుమాళ్లపల్లి శ్రీకాంత్,కిరణ్,దారా చందు, మార్కోవా తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: