రా చెరువు సుందరీకరణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్

Published: Thursday March 03, 2022
మేడిపల్లి, మార్చి 2 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 23వ డివిజన్లోని రా చెరువు సుందరీకరణ పనులను స్థానిక కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రూ 5 లక్షల రూపాయలతో రా చెరువు కట్ట పై చుట్టుముట్టు ఉన్న ప్రాంతాలలో ముళ్ల చెట్లను తొలగించుటకు జెసిబితో పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రా చెరువును సుందరంగా అభివృద్ధి పరుస్తూ, వాకింగ్ టాక్ లు, స్ట్రీట్ లైట్లు ను ఏర్పాటు చేసి అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు  బద్దుల సత్యనారాయణ, పలు కాలనీలు అధ్యక్షులు కృష్ణారెడ్డి, రమణారెడ్డి, భూష గణేష్, ఐలేష్ యాదవ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.