ఎర్రుపాలెం సహకార సంఘం నందు రైతుబంధు సంబరాలు

Published: Monday January 10, 2022
ఎర్రుపాలెం డిసెంబర్ 9 ప్రజాపాలన ప్రతినిది: మండలంలోని ఎర్రుపాలెం సొసైటీ ఆవరణంలో ఏర్పాటు చేసినటువంటి రైతుబంధు సంబరాల కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ ముల్పూరి శ్రీనివాస రావు అధ్యక్షతన రైతుబంధు సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మూల్పూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ 70 సంవత్సరాల చరిత్రలో రాష్ట్రంలో రైతులకు సహాయం అందేలా చేశారని, రైతు బాంధవుడు అని ఆయన పేర్కొన్నారు. ఎంపీపీ శ్రీమతి దేవరకొండ శిరీష, మధిర వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ చావ రామకృష్ణ, సర్పంచ్ మొగిలి అప్పారావు, ఎంపీటీసీ షేక్ మస్తాన్ వల్లి, ఎంపీటీసీ సగ్గుర్తి కిషోర్ బాబు, మండల అధ్యక్షులు పంబి సాంబశివరావు, కార్యదర్శి యన్నం శ్రీనివాస్ రెడ్డి, సోసైటీ డైరెక్టర్ సగ్గుర్తి శిరోమణి, సర్పంచ్ పురుషోత్తం రాజు, కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసినారు. దేశానికి తెలంగాణ రైతులు ఆదర్శంగా నిలిచారు అని కెసిఆర్  రైతుని రాజుగా చేయడంలో ప్రధమ స్థానంలో నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు దేవరకొండ రవి, బుర్ర నారాయణరావు, సంయుక్త కార్యదర్శి తకెళ్ళపాటి వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ భాస్కర్, నండ్రు రవి, సుధీర్, మైనార్టీ సెల్ షేక్ బాజీ, టౌన్ అధ్యక్షులు రాము, రైతు సమన్వయ సమితి గ్రామ శాఖ శ్రీ పోలిశెట్టి తిరుపతి రావు, శ్రీనివాసరావు, దేవరకొండ చిరంజీవి, రేఖ నాగరాజు, రుషేక్ హుస్సేన్, అప్పిరెడ్డి సతీష్ టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.