స్వయం కృషితో పైకి రావాలి - గణేష్ ముదిరాజ్

Published: Saturday May 08, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి :‌ ప్రతీ ఒక్కరూ స్వయం కృషితో పైకి వచ్చి ఆర్థిక స్వావలంబన సాధించాలని బీజేపీ సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం రోజు మియాపూర్ డివిజన్ పరిధిలోని మక్తామహబూబ్ పెట్ లో  దుర్గేష్ నూతనoగా ఏర్పాటు చేసిన సాయితేజ స్టైలిష్ పార్లర్ ను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు మంచి సర్వీస్ అందించి కస్టమర్ల మన్ననలు పొందాలని సూచించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాము తదితరులు పాల్గొన్నారు.