అంబేడ్కర్ ఆశీర్వాదంతో నూతన ఎలక్ట్రిక్ స్కూటీ ప్రారంభం

Published: Thursday June 24, 2021

మంచిర్యాల టౌన్, జూన్ 23, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా కేంద్రంలో జై భీమ్  గ్రూప్ ఆధ్వర్యంలో బుధవారం రోజున ఒక నూతన ఒరవడిని ప్రారంభించిన ఎడ్ల కిష్టయ్య ఒక నూతన ఎలక్ట్రిక్ స్కూటీనీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశీర్వాదంతో, బాబాసాహెబ్ అభిమాని అయిన చెన్నూర్ పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్  చేతుల మీదుగాఎలక్ట్రిక్ బైక్ ను ప్రారంభించడం జరిగింది. అనంతరం బాబాసాహెబ్ వారసులు మాట్లాడుతూ బాబాసాహెబ్ ఆలోచన విధానాలను ముందుకు తీసుకెళ్లడానికి జై భీమ్ గ్రూపు సభ్యులు ఒక కొత్త పద్ధతిని ప్రారంభించడం జరిగిందని, ఇకనుండి దళిత బహుజనులు ఈ మూఢనమ్మకాలను పాటించకుండా బాబాసాహెబ్ అంబేడ్కర్ అడుగుజాడలలో నడవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని కోరరు.బాబాసాహెబ్ అంబేడ్కర్ సూచించిన మార్గంలో నడవాలని ఆయన కోరుకున్న సమాజం కోసం కృషి చెయ్యాలని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీఐ తంగేళ్ల ప్రవీణ్ కుమార్, దేవి సత్యం ఎర్రోళ్ల నరేష్ గారు, పరిగి కనకరాజు దుర్గం రామ్ మూర్తి, సురమల్ల రామ్ చందర్, దేవి పోచన్న, రవీందర్, వేల్పుల సాంబయ్య, నరేష్, స్వామి, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు