పట్టణ ప్రగతి లో భాగంగా కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి మొక్కలు నాటడం జరిగింది

Published: Tuesday June 14, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేదీ 13 ప్రజా పాలన ప్రతినిధి.సోమవారం రోజు తుర్కయంజాల్ మున్సిపాలిటీ లోని మునగనూరు గ్రామంలో 15వ వార్డ్ లో పట్టణ ప్రగతి ( నాలుగో విడత )11వ రోజు కార్యక్రమంలో భాగంగా మునగనూర్ 15th వార్డ్ లోని విగ్నేశ్వర కాలనీలో పర్యటిస్తూ కాలనీ సమస్యలను తెలుసుకొని కాలనీ సభ్యులతో చెట్లు నాటడం జరిగింది మరియు కాలనీలో  జెసిబి సహాయంతో క్లీనింగ్ చేయడం జరిగింది అనంతరం పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రత విషయంలో తగు  ప్రమానికాలు పాటించాలి అని తెలిపిన 15th వార్డ్ కౌన్సిలర్  వేముల స్వాతి అమరేందర్ రెడ్డి .
ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్, రమణ చారి,అమృత్ కుమార్,సత్తయ్య,వెంకటేష్ గౌడ్, విజయ్ సింగ్,అరుణ,అమరావతి, స్వప్న ఝాన్సీ లక్ష్మి,రాణి, మరియు కాలనీ సభ్యులు,అర్జున్ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.