వైకుంఠధామం పెండింగ్ పనులు పూర్తి చేయాలి : ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్

Published: Wednesday November 24, 2021
వికారాబాద్ బ్యూరో 23 నవంబర్ ప్రజాపాలన : వైకుంఠధామం పెండింగ్ పనులు పూర్తి చేయాలని మర్పల్లి మండల ఎంపిడిఓ వెంకట్రామ్ గౌడ్ సర్పంచ్ కార్యదర్శులకు సూచించారు. మంగళవారం మర్పల్లి మండల పరిధిలోని రావులపల్లి, గుర్రంగట్టు తండా, తిమ్మాపూర్ గ్రామ పంచాయతీలను సందర్శించి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ ఉపాధి హామీ 7 రిజిష్టర్లు, గ్రామ పంచాయతీకి సంబంధించిన 33 రిజిష్టర్లను తనిఖీ చేశానని పేర్కొన్నారు. నుర్సరీలో ఎర్రమట్టి రెండు టిప్పర్లు, నల్ల మట్టి ఒక టిప్పర్ సేంద్రియ ఎరువు కలిపి ఈ నెల 25 లోపు బ్యాగు ఫిల్లింగ్ చేయాలని కార్యదర్శికి ఆదేశించారు. క్యాష్ బుక్, చెక్ ఇష్యూ రిజిస్టర్ 15వ ఫైనాన్స్ రిజిస్టర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని చెప్పారు. లేబర్ రిపోర్ట్ 30 మంది ఖచ్చితంగా ఉండే విధంగా చూడాలని లేని ఎడల చర్య తీసుకొనపడునని తెల్పారు. తదుపరి క్రిమిటోరియం పెండింగ్ ఉన్న పనులను పూర్తి చేయాలని అన్నారు. 15 వేల మొక్కలు పెంచుటకు బ్యాగులు రెడీ చేసుకోవాలని వివరించారు. మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీరు అందించాలని మొక్కలు బ్రతికించే బాధ్యత గ్రామ పంచాయితీ సర్పంచ్ కార్యదర్శి పైన ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవమ్మ అబ్రహం, శాలిబాయ్, కార్యదర్శులు స్వప్న, అశోక్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు