ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Published: Tuesday March 09, 2021
మంత్రి ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ సహకారం మరువలేనిది-మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రావణి
జగిత్యాల, మార్చి 08 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని ఉమాశంకర్ ఫంక్షన్ హాలులో పురపాలక సంఘం  ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఛైర్పర్సన్ శ్రావణి హాజరు కాగా, పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు. జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి వ్యవస్థపాక అధ్యక్షురాలు, నిజామాబాదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవితక్క ప్రోత్సహంతో రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ప్రభుత్వం మహిళలకు స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిందని అన్నారు. కరోనా వారియర్స్ అందరిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మున్సిపల్ ఛైర్పర్సన్ అన్నం లావణ్య, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు సిబ్బంది, మెప్మా అధికారులు అర్పిలు  పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.