గవర్నర్ దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపిన తిండేరు హనుమంతరావు దంపతులు

Published: Friday July 23, 2021
మేడిపల్లి, జూలై 22 (ప్రజాపాలన ప్రతినిధి) : హర్యానా రాష్ట్ర గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన బండారు దత్తాత్రేయ తొలిసారిగా హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా బీజేపీ సీనియర్ నేత తిండేరు హనుమంతరావు ఆయన సతీమణి తిండేరు సురేఖ గురువారంనాడు గవర్నర్ దత్తాత్రేయను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో శామీర్ పేట ధర్మారెడ్డి, పరవేష్ కుమార్ తదితరులు ఉన్నారు.