దెందుకూరులో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం
Published: Wednesday January 12, 2022
మధిర జనవరి 11 ప్రజాపాలన ప్రతినిధి మధిర మండలం దెందుకూరు గ్రామంలో గ్రామంలో వెలసియున్న శ్రీ కృష్ణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం జరిగింది, స్వాములు 41 రోజుల దీక్ష చేసి అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనానికి బయలుదేరి వెళుతున్నారు ఈ కార్యక్రమంలో స్వామి అయ్యప్ప ఇరుముడి మహోత్సవానికి ప్రజలు భక్తులు పాల్గొని ఇరుముడి మహోత్సవం కార్యక్రమాన్ని తిలకించిస్వామి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమం అనంతాచార్యులు వారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో యడ్లపల్లి వెంకటకృష్ణ స్వామి, మల్లెల నరేంద్ర స్వామి, యడ్లపల్లి బ్రహ్మం స్వామి కల్లూరి దిలీప్ స్వామి, మువ్వ అఖిల్ స్వామి పాల్గొన్నారు .
Share this on your social network: