పులుమద్ది గ్రామంలో కోటివృక్షార్చన

Published: Thursday February 18, 2021

వికారాబాద్ జిల్లా ప్రతినిధి 17 ( ప్రజాపాలన ) : ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్ లో భాగంగా సిఎం కెసిఆర్ జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకొని కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ప్రారంభించామని సర్పంచ్ తిమ్మాపురం ‌మాధవరెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ మండలానికి చెందిన పులుమద్ది గ్రామంలో సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి కనీసం ఆరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. పచ్చందాల హరివిల్లు గ్రామంగా తీర్చి దిద్దుదామని పిలుపునిచ్చారు. పచ్చని చెట్ల ద్వారా ఆక్సీజన్ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు గయాజ్, బోయిని శ్రీనివాస్ ముదిరాజ్, గ్రామస్థులు బందెల్లి, రాములు, భుజంగరెడ్డి తదితరులు పాల్గొన్నారు.