ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 23ప్రజాపాలన ప్రతినిధి. *మానవత్వం చాటుకున్న పదవ తరగతి పూర్వ విద్యా

Published: Tuesday October 25, 2022
యాచారం మండల పరిధిలోని మల్కి జు గూడ గ్రామానికి చెందిన కాం టే కార్ శ్రీనివాస్  1992.1993 బ్యాచ్ కు  చెందిన వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి పూర్వ విద్యార్థులు మానవతా దృక్పథంతో అతని కుటుంబానికి అండగా నిలవాలన నే దృఢ సంకల్పంతో ఈ రోజు  శ్రీనివాస్ కుటుంబానికి తోటి మిత్రులు 72 వేల రూపాయల ఆర్థిక సాయం అతని కుటుంబానికి అందజేయడం జరిగింది. ఓయమ్మ శ్రీనివాస్ కుటుంబంతోపాటు మిత్రులకు ఎలాంటి ఆపద ఉన్న ఎలాంటి కష్టం ఉన్న ఆదుకోవడానికి మేమందరం కట్టుబడి ఉన్నామని తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ కుటుంబానికి కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటామని మిత్రులందరికీ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ జంగయ్య. మేడిపల్లి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి. మక్కపల్లి శ్రీనివాస. అడ్వకేట్  జైపాల్ రెడ్డి. శ్రీనివాస్ నాయక్. ఆర్టీసీ డ్రైవర్ సిహెచ్ బాలయ్య. యాచారం మండలం మాజీ సింగల్ విండో వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి. డి రాములు. మంజులా రెడ్డి. జ్యోతి రెడ్డి. విజయలక్ష్మి. జంగారెడ్డి. సిఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి. వి శ్రీనివాస్. జి రమేష్. విజయలక్ష్మి . తోబాటు సహకరించిన తోటి మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలోతదితరులు పాల్గొన్నారు.