నిరంతరం కొనసాగే కార్యక్రమం మీతో నేను

Published: Friday April 23, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 22 ప్రజా పాలన : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం చూపరాదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీతో నేను కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మీతో నేను కార్యక్రమంలో గుర్తించిన త్రాగునీరు, కరెంట్, పాడుబడిన ఇండ్లు కూల్చివేత, డ్రైనేజీ వంటి సమస్యలపై అధికారులతో చర్చించారు. అధికారులు తమ పరిధిలో ఉన్న చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రజా ప్రతినిధులు ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే స్పందించాలన్నారు. మీతో నేను కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఎంపిడిఓ లు లక్ష్మి నారాయణ, సురేష్ బాబు, బాలయ్య, శైలజ రెడ్డి, ఎంపిఓ లు నాగరాజు, షఫీ, డేనియల్, యాదగిరి, సోమలింగం, పంచాయతీ సెక్రటరీ లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.