ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను అమలు చేస్తా

Published: Thursday December 09, 2021
ప్రజల సహకారంతో నేరాన్ని నియంత్రించవచ్చు
విలేకరుల సమావేశంలో రూరల్ ఎస్సై రవికుమార్
మధిర డిసెంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో రూరల్ పోలీస్ స్టేషన విలేకరుల సమావేశంలో ఖమ్మంకమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ఆదేశాల మేరకు వైరా ఏసిపి స్నేహ మెహర మధిర సిఐ మురళి ఆధ్వర్యంలో మధిర రూరల్ పోలీస్ స్టేషన్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను అమలు చేస్తానని రూరల్ ఎస్ఐ రవి కుమార్ తెలిపారు. గ్రామాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. దొంగతనాల నివారణకు ప్రతి గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. గుట్కా గంజాయి లాంటి మత్తు పదార్థాల పై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు