సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన - కురుమ సంఘ పెద్దలు

Published: Friday July 23, 2021
జగిత్యాల, జూలై 22 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కురుమ సంఘ నాయకులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రెండవ విడత గొర్రెల పంపిణీకి 6 వేల కోట్ల నిధుల కేటాయించి ఒక్కోక్క గొర్రెల యూనిట్ కు 1,25,000 వేల నుండి 1,75,000 వేల రూపాయలకు పెంచిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్ లో ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ ను కలిసి కురుమ సంఘ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షిరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘ జిల్లా అధ్యక్షుడు వొళ్ళెం మల్లేశం పట్టణ అధ్యక్షులు పుల్ల గంగారాం ప్రధాన కార్యదర్శి పుల్ల మహేష్ చెట్టె రమేష్ సాయిల్ల మురళి బండారి మల్లేశ్ దయ్యాల రాజాం పుల్ల గట్టయ్య దయాల మలారెడ్డి పుల్ల గట్టురాజు చెట్టె కొమురయ్య దాయాల కిష్టయ్య సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.