వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి

Published: Wednesday September 21, 2022
 మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో 20 సెప్టెంబర్ ప్రజా పాలన : వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్డిఓ కార్యాలయం ముందు గత 58 రోజులుగా తమ డిమాండ్ల కోసం నిరవధిక  దీక్ష చేస్తున్నారు. దీక్ష శిబిరాన్ని సందర్శించి వీఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.  న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగిస్తుందని తెలిపారు. అసెంబ్లీలో ప్రకటించిన పెస్కేల్ ను వెంటనే అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి చామల రఘుపతి రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, కిసాన్ సెల్ అధ్యక్షులు రత్నా రెడ్డి, నర్సిములు, మహిపాల్ రెడ్డి, కమాల్ రెడ్డి, కిష్టా రెడ్డి, కౌన్సిలర్ లు మురళి. రెడ్యానాయక్, చాపల శ్రీనివాస్ ముదిరాజ్ బాలకృష్ణ, విజయ్ కుమార్, సంజీవ్, కరీం. మహేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.