బీసీ విద్యార్థి,యువజన,పోరు యాత్రను విజయవంతం చేయండి **
Published: Friday December 16, 2022
బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రుప్నర్ రమేష్ **
పోరు యాత్ర పోస్టర్లు విడుదల **
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 15 (ప్రజాపాలన,ప్రతినిధి) : బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు శుక్రవారం16న జిల్లా కేంద్రంలో జరగనున్న బీసీ విద్యార్థి,యువజన,పోరు యాత్రను విజయవంతం చేయాలని, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ రమేష్ అన్నారు. గురువారం పోరు యాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆరే సంక్షేమ భవనం లో పత్రికా సమావేశంలో విడుదల చేశారు.సందర్భంగా రూప్నర్ రమేష్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ సారాధ్యంలో ఈ నెల 2 నుండి జనవరి 8వరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజన పోరు యాత్ర కొనసాగుతుందని, రాష్ట్రంలో బీసీ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని, పక్కా భవనాలు నిర్మించాలని, ఫీజు రియంబర్స్మెంట్,బీసీ రిజర్వేషన్లు పెంచాలని, బీసీ గురుకులాలకు పక్క భవనాలను నిర్మించాలని, తదితర డిమాండ్లతో విద్యార్థి యువజన పోరు యాత్ర జరుగుతుందన్నారు.ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరే సంక్షేమ సంఘం నాయకులు,జాతీయ యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: