*అవినాష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు* *దేశానికే ఆదర్శం బి ఆర

Published: Thursday February 02, 2023
ప్రజాపాలన షాబాద్ ::సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అందుకనే బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు అన్ని పార్టీల, ప్రాంతాల నాయకులు ముందుకు వస్తున్నారని జెడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఆయన నివాసంలో పెద్దవీడు గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువలు కప్పి పార్టీలోకి 
ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా కేవలం అభివృద్ధి తపించేది సీఎం కేసీఆర్ ఒకరేనని ఆయన గుర్తు చేశారు. వ్యక్తిగత, సామూహిక అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పథకాలను రూపొందిస్తున్నారని, అమలు పరుస్తున్నారని చెప్పారు.
పార్టీలో చేరిన వారిలో 
 వార్డు మెంబర్లు ఎల్. రాజు, కే. నరసింహ, మాజీ వార్డ్ సభ్యుడు జి.కృష్ణయ్య గౌడ్, సుధాకర్, రాజు, రవి, తదితరులు పార్టీలో చేరగా నాయకులు యాదగిరి, మల్లేష్ శ్రీధర్ ,వీరేందర్  బి, అశోక్ గౌడ్, చక్కటి దేవేందర్ రెడ్డి, బి. ప్రసాద్, బాలరాజు గౌడ్, కుమార్ యాదవ్, నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.