ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మట్ ధరించాలి : పట్టణ సిఐ రాజశేఖర్
Published: Saturday February 06, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 05 ( ప్రజాపాలన ) : ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని పట్టణ సిఐ రాజశేఖర్ హితవు పలికారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా ఎస్ఐ లక్ష్మయ్య ఆధ్వర్యంలో స్థానిక యువకులతో కలిసి పట్టణ పరిధిలోని ప్రధాన రహదారిలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. వాహనం నడిపే ముందు ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన పత్రాలను దగ్గర ఉంచుకోవాలని తెలిపారు. ఇంటిలో నుండి బయలు దేరేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వివరించారు. ప్రతి వాహనదారుడు రోడ్డు నియమాలను పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు అనుసరించి వాహనాలు నడపాలని తెలిపారు.
Share this on your social network: