నిందితులపై రౌడీ షీట్ ఓపెన్...

Published: Tuesday October 19, 2021

జగిత్యాల, అక్టోబర్ 18 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో అక్టోబర్ 16వ తేదీన జరిగిన తోట రాజశేఖర్ ను హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి సోమవారం రోజున రిమాండ్ కు తరలించినట్టు జగిత్యాల డిఎస్పి రత్నాపురం ప్రకాష్ కుమార్ తెలిపారు. నిందితులు సమిండ్ల మహేష్ వీరబత్తిని సాయికిరణ్ పైన రౌడీ షీట్ కేసు నమోదు చేసినట్లు డిఎస్పి తెలిపారు. డి.ఎస్పీతో పాటు టౌన్ సీఐ కిషోర్ కూడ ఉన్నారు.