ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వామాపక్షాల అభ్యర్థి బి.జయసారధిరెడ్డి

Published: Friday March 12, 2021
మధిర, మార్చి 11, ప్రజాపాలన ప్రతినిధి: నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలలో సిపిఐ సీపీఎం ఇతర ప్రజాసంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, నిరుద్యోగ యువత, కార్మిక సంఘాలు, బలపరచిన అభ్యర్థి, బి. జయసారధిరెడ్డి గారు ఎన్నికలప్రచారంలో దూసుకుపోతున్నారని సిపిఐ సీపీఎం పట్టణ కార్యదర్శులు బెజవాడ రవి, శీలం నరసింహారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ, కొత్త పెన్షన్లు, స్థలం వున్నవారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, ఉద్యోగులకు పీ ఆర్ సీ, కోటి ఎకరాలకు నీళ్లు, ఇలా ఇచ్చిన హామీలను అమలు చేయని కెసిఆర్ ప్రభుత్వానికి చెంప పెట్టులాగా ఈ నెల 14న జరిగే పట్టభద్రుల ఎన్నికలలో పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి పవర్ బ్రోకర్ని చిత్తు గా ఓడించాలని చేస్తున్న ఎన్నికల ప్రాచ్చారానికి ఉద్యోగ ఉపాధ్యాయులు,నిరుద్యోగు లనుండి అనూహ్య ప్రజాదరణ లభిస్తుందని బెజవాడ రవి తెలిపారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతి ఊరిలో రైతులు కూడా వచ్చి వామాపక్షాల అభ్యర్థి కి మద్దతు తెలపడం చూస్తుంటే జయసారధిరెడ్డి గారి విజయాన్ని ఏ శక్తి అడ్డుకోలేదని అర్ధం అవుతుందని,బెజవాడ రవి తెలిపారు. ఈ ప్రచారంలో సిపిఐ సీపీఎం మండల కార్యదర్శులు ఊట్ల కొండ, మందా సైదులు , ప్రభాకర్, బ్రహ్మం, రాధాకృష్ణ,మురళి, రామకృష్ణ, సత్యనారాయణ, పాల్గొన్నారు