పది పరీక్షల్లో 10/10 సాధించిన విద్యార్థులకు 10 వేలు నోట్ బుక్స్ పంపిణీ

Published: Wednesday July 20, 2022
మేడిపల్లి, జూలై 19 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మేడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మేయర్ జక్క వెంకట్ రెడ్డి సొంత డబ్బులతో నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణా రాష్ట్ర కార్మిక&ఉపాధి శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కటేపల్లి జనార్దన్ రెడ్డి, స్థానిక 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.
అనంతరం కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 10/10 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు 10    వేల రూపాయల చెక్కును మంత్రి మల్లారెడ్డి, మేయర్ జక్క వెంకట్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సత్యప్రసాద్ సమక్షంలో అందించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు విద్య వాలంటర్లకు ప్రతి నెల10 వేల రూపాయల శాలరీ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ,మున్సిపల్ కమిషనర్  ,కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు,పట్టణ పెద్దలు, ఉపాధ్యాయులు,25వ డివిజన్ నాయకులు పాల్గొన్నారు.