వేగవంతంగా మార్కెట్ పనులు పూర్తిచేయాలిని ఆదేశించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

Published: Monday February 14, 2022
పాలేరు పిబ్రవరి 13 ప్రజాపాలన ప్రతినిధి : మద్దులపల్లి మార్కెట్ ని త్వరిత గతిన పూర్తి చేయాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ఈరోజు కలవడం జరిగినది ఈ కార్యక్రమంలో పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి ఖమ్మం ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు, వ్యవసాయ శాఖ మరియు మార్కెటింగ్  శాఖ మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని కలిసి మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ ఆవశ్యకతను వివరించి చెప్పి అతి వేగంగా నిర్మాణం చేయాలని కోరడం జరిగినది. ఇట్టి విషయం మనకు మంత్రిగారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులైనా మార్కెటింగ్ డైరెక్టర్ అయినా లక్ష్మీ బాయిని, ఎస్సీ లక్ష్మణ్ గౌడ్ ని, మార్కెట్ సెక్రటరీ ఆంజనేయులు, డి ఈ సమాధానం, ఏ ఈ సుబ్బారావు, తదితర అధికారులను పిలిపించి అతివేగంగా మార్కెట్ నిర్మాణం చేయాలని దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని మంత్రిగారు ఆదేశించడం జరిగింది. ఇట్టి మార్కెట్ శంకుస్థాపన నిమిత్తం ఈ నెల 17 తర్వాత డేట్ ఇస్తానని అని తెలిపినారు. అట్టి శంకుస్థాపనకు మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు, జిల్లా ఎమ్మెల్సీ తాత మధుసూదన్ రావు, గార్ల ద్వారా శంకుస్థాపన జరుగును. ఇట్టి మార్కెట్ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి మార్కెట్ నిర్మాణం కొరకు కృషిచేసిన మంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, గారికి, జిల్లా ఎమ్మెల్సీ  మధుసూదన్ రావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణు గారు డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్ రావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లిడి అరుణ వెంకటేశ్వరరావు గారు ధన్యవాదాలు తెలియజేశారు. ఇట్టి విషయం తెలిసిన వెంటనే ఈ మార్కెట్ కు సంబంధించిన రైతులందరూ హర్షం వ్యక్తం చేశారు