రాయికల్ లో లక్షా 25 వేలు గుట్కా పట్టివేత
Published: Friday June 17, 2022
రాయికల్, జూన్ 16(ప్రజాపాలన ప్రతినిధి) అజయ్ కుమార్ రాథోడ్ అనే వ్యక్తి జన్నారం నుండి రాయికల్ పట్టణానికి నిషేధిత గుట్కాను తరలిస్తుండగా రామాజిపేట గ్రామ శివారులో గురువారం పట్టుకున్నట్లు ఎస్.ఐ పబ్బం కిరణ్ కుమార్ గౌడ్ తెలిపారు. అతనివద్ద నుండి సుమారు లక్షా 25 వేల రూపాయల విలువ గల నిషేధిత గుట్కాను, ఆటోను పట్టుకొనిసీజ్ చేసి కేసునమోదు చేశామని అన్నారు. రాయికల్ పట్టణంలో ఎవరెవరికి గుట్కాను సప్లై చేస్తున్నాడో వారి వివరాలను అతని ద్వారా సేకరించామని, త్వరలోవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు.
Share this on your social network: