కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేసిన కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి

Published: Wednesday February 16, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి 15 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ బుద్ధానగర్లో జనావాసాలు పెరగడంతో విద్యుత్ సప్లైకు సరిపడా విద్యుత్ స్తంభాలు లేక కనెక్షన్ ఇవ్వడానికి మరియు వీధి దీపాలు అమర్చడానికి సరిపడ విద్యుత్ స్తంభాలు లేవని కొత్తవి అమర్చమని సమస్యను కాలనీ వాసులు కార్పొరేటర్ మద్ది యుగంధర్ రెడ్డి దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించిన కార్పొరేటర్ అధికారులతో చర్చించి సమస్యకు శాశ్వతంగా  పరిష్కారించడానికి రోడ్డు నంబర్ 1, 2, 4, 6 వద్ద 5 చోట్ల కొత్త విద్యుత్ స్తంబాలు ఏర్పాటు చేశారు. సమస్య పరిష్కరానికి తక్షణమే సహకరించిన మున్సిపల్ కార్పొరేషన్ కరెంటు డిపార్టుమెంటు అధికారులకు, సిబ్బందికి కార్పొరేటర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అశోక్ రెడ్డి, ఆదిత్యమోహన్, ప్రమోద్ రెడ్డి, మహెష్, నర్సింహారెడ్డి, ఇంద్ర రెడ్డి, రఘురాములు, విశ్వేశ్వరు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.