గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ డిమాం
Published: Monday September 12, 2022
ఆదివారం ఇబ్రహీంపట్నంలోని పాషా,నరహరి స్మార కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల 3వ మండల మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్మికులు అనేక సంవత్సరాలుగా సేవలు చేస్తున్న వారి సమస్యలు పరిష్కరించలేదన్నారు. జీవో నెంబర్ 51ని సవరించి ప్రతి కార్మికుడికి 8500/- రూపాయల వేతనం ఇవ్వాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి. ప్రతి గ్రామపంచాయతీ కార్మికుడికి ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. గ్రామపంచాయతీ కార్మికులకు పిఆర్సి వర్తింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. పల్లె ప్రగతి విజయవంతం గ్రామపంచాయతీ కార్మికుల పాత్ర కీలకమని తెలిపారు. కనుక గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. అనంతరం 24మందితో నూతన మండల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షురాలుగా సిహెచ్.బుగ్గరాములు మండల అధ్యక్షులుగా బాలప్ప, మండల కార్యదర్శిగా దేవదాస్, కోశాధికారిగా భాస్కర్, ఉపాధ్యక్షులు మల్లేష్, నరసింహ, సహాయ కార్యదర్శిగా యాదయ్యలను ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు పాండు, కార్మికులు అబ్బయ్య, కిష్టమ్మ, భారతమ్మ, జంగయ్య, మైసయ్య, వెంకటయ్య, అందాలు తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు పాండు, కార్మికులు అబ్బయ్య, కిష్టమ్మ, భారతమ్మ, జంగయ్య, మైసయ్య, వెంకటయ్య, అందాలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: