కొండా లక్ష్మణ్ బాపూజీ కి ఘన నివాళి

Published: Wednesday September 28, 2022

కోరుట్ల, సెప్టెంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి): కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌక్ వద్ద ఉన్న కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముఖ్య చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండ లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు మరువకూడదన్నారు. స్వతంత్ర ఉద్యమంతో పాటు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర పోరాటం వెలకట్టలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు బలిజ రాజారెడ్డి, సామ ల శ్రీనివాస్ ,గజం శంకర్, ఆలే రాము, మిట్టపల్లి రమణ, గుండేటి కిరణ్ పాతికేయలు తదితరులు పాల్గొన్నారు.