మృతుడి కుటుంబానికి ఎస్ కే ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం

Published: Tuesday October 04, 2022
కేంద్ర గ్రంథాలయం మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 3 అక్టోబర్ ప్రజా పాలన : అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేయుటకు ఎస్ కేఆర్ ట్రస్ట్ ఆపన్న హస్తం అందిస్తుందని ఎస్ కే ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జిల్లా కేంద్ర గ్రంథాలయం సంస్థ మాజీ అధ్యక్షులు సనగారి కొండల్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకొనుటకు తనవంతు చిన్న ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ సందర్భంగా నైనా వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క కుటుంబం దుఃఖసాగరంలో మునుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని వ్యక్తిగతంగా పరామర్శించి ఆర్థిక చేయూత అందిస్తే ఆ కుటుంబానికి ఎంతో కొంత ఊరట లభిస్తుందని ఆకాంక్షించారు. అందులో భాగంగానే మర్పల్లి మండల పరిధిలోని పంచలింగాల్ గ్రామానికి చెందిన గొల్ల రాజేష్ అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం రాత్రి మృతిచెందిన సమాచారం అందినదని తెలిపారు. అట్టి విషయం తెలుసుకున్న ఎస్ కే ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, వికారాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయం సంస్థ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి వెంటనే స్పందించి 5 వేల రూపాయలు నగదును పంచలింగాల్ సర్పంచ్ సనగారి సురేందర్ రెడ్డి ద్వారా మృతుడు రాజేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి అందజేశారు. ఆయన వెంట వార్డు సభ్యుడు సంజీవ్, గ్రామస్తులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.